అందాల కథానాయికలని ఎప్పుడుకూడా పెళ్లి ఎప్పుడూ అని అడగకూడదు. ఒకవేళ అడిగిన దానికి సమాధానం ఎలా ఉంటుందో ఊహించుకోగలం. రంగుల ప్రపంచంలో పెళ్లి అనే టాపిక్ తో చాలా తలనొప్పులు ఉంటాయి. ఆ ఒక్కటి ఇక్కడ వందల కోట్ల బిజినెస్  ని ప్రభావితం చేస్తుంది. ఫలానా హీరోయిన్ కీ పెళ్ళంట అన్న ఒక్క మాటతో క్యూలో ఉన్న ఛాన్స్ లన్ని జీరో అయిపోతాయి. అందుకే నాయికలు చాలా వరకు పెళ్లిని వాయిదా వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. చేతిలో ఉన్న కమిట్మెంట్ లను పూర్తి చేస్తే కానీ పెళ్లి మ్యాటర్ జోలికి వెళ్లరు. అందుకే ఓ యంగ్ హీరోయిన్ సినిమాల కోసం పెళ్లి సైతం వాయిదాలు వేస్తూ వస్తోంది. అభిమానులు కర్ణాటక క్రష్ అని ముద్దుగా పిలుచుకునే ప్రముఖ సౌత్ నటి రష్మిక మందన స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్పలో రష్మిక శ్రీ వల్లి గా కనిపించనుంది. ఈ చిత్రం డిసెంబర్ 17 న తెరపైకి రానుంది. ఈ చిత్రం గురించి హిందీ తో సహా పలు భాషల్లో విడుదల కానుంది. మరో వైపు ఆమె బాలీవుడ్ ఎంట్రీ మూవీ మిస్టర్ మజ్ను కూడా  విడుదలకు సిద్ధమైంది.

 ఇదిలా ఉండగా రష్మికా తన ప్రేమ జీవితం గురించి స్పందించింది. తన వయసు కంటే తక్కువ వయసున్న వ్యక్తి తో డేటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగినప్పుడు కుర్రాడి తో డేటింగ్ చేయడంలో తప్పేంటని ప్రశ్నించిన రష్మిక ప్రేమకు వయసు,భాష అడ్డంకులు లేవని చెప్పింది. అబ్బాయి ఎలా ఉండకూడదు అనే దాని గురించి మాట్లాడుతూ అబ్బాయి అమ్మాయిని మార్చడానికి లేదా ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడదని ఆమె ఎలా ఉంటుందో అలా ఉండనివ్వమని చెప్పింది. రష్మిక గతంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టి తో రిలేషన్ షిప్ లో ఉంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు రకరకాల కారణాల వల్ల వారి నిశ్చితార్థం అనంతరం పెళ్లి రద్దయింది. ప్రస్తుతం బహుభాషా చిత్రం పుష్పాలో అల్లు అర్జున్ సరసన నటిస్తున్న రష్మిక బాలీవుడ్లో రెండు సినిమాలు చేస్తోంది. ఆమె అమితాబచ్చన్ ప్రధానపాత్రలో నటిస్తున్న గుడ్ బాయ్ లో కీలక పాత్రను పోషిస్తుంది. టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గక ముందే ఇతర భాషలలోనూ అవకాశాలు దక్కించుకుంటూ క్రేజీ తారగా వెలిగిపోతుంది. మూడు భాషల్లో మూడుముక్కలాట ఆడుతోంది ఈ బ్యూటీ.

మరింత సమాచారం తెలుసుకోండి: