హీరో కావాలనే ఆశతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి కమిడియన్ గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిన సీనియర్ నటుడు బ్రహ్మాజీ. తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చే టాప్ కమిడియన్స్ లో బ్రహ్మాజీ కూడా ఒకరు. స్క్రీన్ పైనే కాదు సోషల్ మీడియా లోనూ ఈ నటుడు అభిమానుల్ని తెగ నవ్విస్తుంటాడు. సోషల్ మీడియాలో ఎపుడు యాక్టివ్ గా ఉండే బ్రహ్మజి కొన్ని సార్లు తన పోస్ట్ ల ద్వారా విమర్శలు కూడా ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఆ మధ్య హైదరాబాద్ లో వరదలకి జనాలు ఇల్లు, ఊళ్లు కొట్టుకు పోయి నానా తంటాలు పడుతున్న సమయం లో... నాకు ఒక పడవ కావాలి అంటూ ఒక పోస్ట్ బ్రహ్మాజీ పెట్టడంతో, ఆ విషయం కాస్త వైరల్ గా మారింది.

దీంతో నెటిజన్లు బ్రహ్మాజీ ని ఒక ఆట ఆడేసుకున్నారు అంటే ఆ పోస్ట్ ఎంత నెగిటివ్ వైబ్ క్రియేట్ చేసింది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . అయినా బ్రహ్మాజీ మాత్రం అతనికి అనిపించింది అనిపించినట్లు సోషల్ మీడియా లో పోస్ట్లు పెడుతూ ఉంటారు. అయితే అలాంటి నటుడు బ్రహ్మాజీ ఇపుడు కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నారు అని తెలిసి అంతా షాక్ అవుతున్నారు. అసలు విషయం ఏమిటి..?? ఇది నిజమేనా..?? ఎందుకు బ్రహ్మాజీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ..?? అంటూ ఆశ్చర్యపోతున్నారు.

అయితే ఇకపై కొద్ది రోజులు సోషల్ మీడియా కు దూరంగా ఉండాలి అని అనుకుంటున్నాను అంటూ స్వయంగా బ్రహ్మాజీ నే ప్రకటించారు. అయితే ఎందుకు ఈయన ఇలా అంటున్నారు ,దీని వెనుక పెద్ద కారణం ఏమైనా ఉందా అన్న వివరాలు మాత్రం తెలియలేదు. కొందరు తెలుపుతున్న సమాచారం ప్రకారం సినిమాలపై ద్రుష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: