పూజా హెగ్డే టాలీవుడ్ లో అత్య‌ధిక రెమ్యూన‌రేష‌ర్ తీసుకుంటున్న హీరోయిన్. అలాగే ప్ర‌స్తుతం భాష‌ల‌తో సంబంధం లేకుండా మోస్ట్ బిజీ హీరోయిన్ కూడా పూజా హెగ్డే నే. ఇంత‌టి గుర్తింపు, క్రేజ్ రావ‌డానికి పూజా చాలానే క‌ష్ట ప‌డింది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ల‌లో అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తి సినిమాలో న‌టించింది. అంతే కాకుండ త‌న న‌ట‌న తో మంచి మార్కులు కూడా తెచ్చు కుంది. ప్ర‌స్తుతం తెలుగు లో ఎ నిర్మాత అయిన సినిమా తీయాలంటే హీరోయిన్ గా మొద‌టి ప్రీయారిటి పూజా హెగ్డే కే ఇస్తారు. పూజాహెగ్డే డేట్స్ ఖాలీ గా లేకుంటే మ‌రో హీరోయిన్ పైపు చూస్తారు. అంత‌టి క్రేజ్ తెచ్చు కుంది ఈ బుట్ట బోమ్మ‌. పూజా హెగ్డే తెలుగు లో న‌టించిన చాలా సినిమా లో బాక్స్ ఆఫీస్ ను మొత్తం షేక్ చేశాయి. అందుకే పూజా హెగ్డ అంటే అంత క్రేజ్.



అయితే తెలుగు పూజా హెగ్డే న‌టించిన చాలా సినిమా ల‌కు గుర్తింపు వ‌చ్చింది. అలాగే కొన్ని చిత్రాల‌కు ఉత్త‌మ న‌టి అవార్డు ల‌ను కూడా సొంతం చేసుకుంది. ముందుగా అల్లు అర్జున్ తో న‌టించిన దువ్వాడ జ‌గ‌న్నాథం అనే సిన‌మా కు జీ గోల్డేన్ అవార్డ్స్ లో ఎంటర్ టైన‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అనే అవార్డును సొంతం చేసుకుంది. అలాగే జీ సినిమా అవార్డ్స్ లో  మ‌హ‌ర్షి సినిమా కు సంబంధించి ఫేవ‌రేట్ హీరోయిన్ అనే అవార్డు ను సొంతం చేసుకుంది. అలాగే సాక్షి ఎక్స‌లెన్స్ అవార్డు ల్లో అలా వైకుంఠ పూరం లో అనే సినిమా లో హీరోయిన్ పాత్ర కు ఉత్త‌మ న‌టి అవార్డును అందుకుంది. అలాగే ఇదే సిన‌మా కు సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌నల్ మూవీ అవార్డ్స్ లో తెలుగు కు సంబంధించి ఉత్త‌మ న‌టి అవార్డు ను కూడా సాధించింది.  






మరింత సమాచారం తెలుసుకోండి: