అయితే ప్రస్తుతం సమంత యశోద, శాకుంతలం విజయ్ దేవరకొండ తో ఖుషి అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. వీటితో పాటుగా హిందీ ప్రాజెక్ట్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా ప్రస్తుతం ఇంత బిజీగా ఉన్న సమంత ను చూసి కంగారు పడుతున్నారట దర్శక నిర్మాతలు. అదేంటి అస్సలు ఎందుకలా విషయం ఏమిటి అంటే...!! సాదరంగా సోషల్ మీడియాలో హీరో హీరోయిన్లకు పాజిటివ్ కామెంట్స్ తో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తు వుంటాయి..ఇది సర్వ సాధారణం. అయితే ఎవరో కొందరు తప్ప.. మిగిలిన సెలబ్రిటీలు అంతా అస్సలు అలాంటివి పట్టించుకోకుండా ముందుకు వెళుతుంటారు. అయితే సమంత మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు. తనపై ఏమైనా నెగిటివ్ వార్తలు వినిపిస్తే వెంటనే స్పందించిన సందర్భాలు చాలానే. ఎలా స్పందించారు అన్నది పక్కన పెడితే వాటికి రియాక్ట్ అయితే మరింత నెగిటివిటి పెరుగుతుంటుంది.
ఇది వారి కెరియర్ పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అయితే ఇదే విషయం లో సమంత వ్యవహరిస్తున్న తీరుపై ఆమెతో సినిమాలను రూపొందిస్తున్న నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తునట్టు తెలుస్తోంది. నాగ చైతన్య తో విడాకులు తర్వాత సమంత పై సోషల్ మీడియా నెగటివిటీ విపరీతంగా పెరిగిపోయింది అనే చెప్పాలి ..ఈ నెగటివిటీ తమ సినిమాలపై ఎక్కడ పడుతుందో అని ఆమె నిర్మాతలు తెగ కంగారు పడుతున్నారు అని సమాచారం. ముఖ్యంగా శాకుంతలం మరియు యశోద సినిమాలకు వందల కోట్లు ఖర్చు పెట్టి భారీ బడ్జెట్ తో వీటిని రూపొందించారు. రెండు సినిమాలు కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలే అయితే.. ఇలా సోషల్ మీడియాలో నెగటివిటీ పెంచుకుంటూ పోతే రేపు నీ సినిమాలకి ఉన్న పాజిటివ్ బజ్ కాస్త పోయి నెగిటివిటిని పెంచే అవకాశం ఉంటుంది అని..దయచేసి నెగటివ్ కామెంట్స్ కి సోషల్ మీడియా లో స్పందించడం కొన్నాళ్ళు తగ్గించండి అంటూ సమంత కి నిర్మాతలు కుయ్యో మొర్రో అంటూ ఆందోళన చెందుతున్నారు ..మరి వారి మాటలను సమంత వినకుండా పెడ చెవిన పెట్టి... అనుకున్నట్లే సినిమాలు నెగిటివ్ టాక్ తెచ్చుకుంటే ఇక సమంత కెరియర్ సమస్యల్లో పడే అవకాశం ఉంది అంటున్నారు. ఇది నిజంగా సమంత ఫ్యాన్స్ కు బాధ కలిగించే వార్త అని చెప్పాలి.