బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి క్రేజీ హీరోయిన్ గా చక్రం తిప్పింది నటి మీనా. తెలుగు, తమిళ్, కన్నడ , మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. అలాంటి మీన సినిమాలు తగ్గి హీరోయిన్ గా అవకాశాలు పూర్తిగా కనుమరుగైన కూడా చాలా కాలం పెళ్లి ఊసే ఎత్తకుండా సింగిల్ గానే ఉంది. అలాంటిది సడెన్ గా బెంగళూరు కు చెందిన సాఫ్టు వేర్ విద్యా సాగర్ ని పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. 2009 లో వీరి పెళ్లి కాగా వీరికి ఒక కుమార్తె ఉంది. తన పేరు నైనిక. విజయ్ హీరోగా చేసిన పోలీసోడు చిత్రంలో ఇప్పటికే బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది నైనిక. అయితే ఇటీవలే భర్త ప్రోత్సాహంతో సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసారు మీనా.

ఇలా వీరి జీవితం ఎంతో సంతోషంగా సాగుతున్న సమయంలో హఠాత్తుగా కొద్ది రోజుల క్రితం విద్యా సాగర్ లంగ్స్ ఇన్ఫెక్షన్ తో మరణించారు. పావురాలు వ్యర్ధాలు కారణం గానే ఆయనకు ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యాయి అని పలు కథనాలు వినపడుతున్నాయి. అయితే తాజాగా ఈ విషయం స్పందించారు సీనియర్ తమిళ నటి కుట్టి పద్మిని. ఈమె మీన - విద్య సాగర్ ల వైవాహిక జీవితం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీనా వల్ల ఇంటి దగ్గర పావురాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నది నిజం. అయితే విషయం ఏమిటంటే గత కొంత కాలంగా మీనాకు, విద్యాసాగర్‌కు మధ్య మనస్పర్థలు పెరిగి దూరంగా ఉంటున్నారు అని తనకు తెలిసినట్లు చెప్పుకొచ్చారు.

మీన తన కుమార్తె తో చెన్నై లో ఉంటుండగా... విద్యా సాగర్ మాత్రం బెంగుళూరు లో ఒంటరిగా నివసించేవారట. కాగా తీవ్ర మనస్థాపంతో ఉన్న ఆయన ఎక్కువగా పావురాలతో ఆడుకుంటూ సమయం గడిపే వారు అని అలా ఆయనకు ఇన్ఫెక్షన్ సోకి చివరికి మరణించినట్లు తెలిసింది అని ఆమె చెప్పుకొచ్చారు. ఇక నటి మీనాకి ఆ దేవుడు ఈ గట్టు పరిస్థితుల నుండి బయట పడే దైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు తమిళ సీనియర్ హీరోయిన్ కుట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి: