దీపావళి సందర్భంగా ఒక్కరోజు ముందు ఉత్తర భారతదేశంలో దంతేరాస్ జరుపుకుంటారు. అయితే ఈ
పండుగ సందర్భంగా
హ్యుండై మోటార్స్ ఏకంగా ఒక్కరోజే 12500 కార్లు డైవెరీ ఇచ్చారట.
మారుతి సుజుకి తర్వాత ఇండియాలో ప్యాసెంజర్ వెహికల్స్ లో రెండో స్థానంలో ఉంది హ్యుండై.
మారుతి తర్వాత వాహనదారులు ఎక్కువగా కొంటున్న కార్లు
హ్యుండై మోటార్స్ వే అవడం విశేషం. అంతేకాదు టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లలో కూడా ఈ రెండే ముందు ఉంటాయి.
హ్యుండై నుండి కొత్తగా వచ్చిన వెన్యూ, గ్రాండ్ ఐ10 నియోస్ లకు దేశీయ
మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది.
హ్యుండై వెన్యూ సేల్స్ మూడు నెలలుగా భారీగా ఉన్నాయి.
వీటితో పాటుగా
హ్యుండై క్రెటా, ఎలైట్, ఐ20 ప్రీమియం హ్యాచ్ బ్యాక్ వెహికల్స్ కూడా సేల్స్ భారీగా ఉన్నాయి. ఇండియన్
మార్కెట్ లో బెస్ట్ సెల్లింగ్ వెహికల్ గా
హ్యుండై ఎలైట్ ఐ20 మొదటిస్థానంలో ఉంది.
దీపావళి సందర్భంగా 12500 కార్లు అమ్మి
హ్యుండై మరోసారి
మార్కెట్ ను శాసించిందని చెప్పొచ్చు.