ఈ హాట్ సమ్మర్లో మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ ఇండియా, మహీంద్రా, నిస్సాన్ వంటి కార్ల తయారీ సంస్థలు  ఎంపిక చేసిన మోడళ్లపై  రూ.3.01 లక్షల వరకు భారీ ప్రయోజనాలను ప్రకటించాయి.మే 31 వరకు పొందవచ్చు.ఇక అందులో న్యూ మహీంద్రా ఎక్స్‌యూవీ 500ని ఇండియాలో త్వరలోనే  ప్రవేశపెట్టనుంది.కస్టమర్లు మొత్తం రూ.98,100 తగ్గింపును పొందవచ్చు. ఇందులో 51,600 నగదు ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్ 25వేలు, కార్పొరేట్ బోనస్ 6,500 ఉన్నాయి.ఎక్స్‌యూవీ 500 ధర రూ.15.53 లక్షల నుండి ప్రారంభమై రూ. 20.04 లక్షలు (ఢిల్లీ ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.


రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ కారు పై  గరిష్టంగా 75,000 వరకు బెనెఫిట్స్ తో జాబితా చేసింది.  ఇందులో రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ.15,000 వరకు లాయల్టీ ప్రయోజనం కూడా ఉంది.అలాగే ఎస్‌యూవీపై  రూ.30,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది.రెగ్యులర్ 1.5-లీటర్ వేరియంట్ పై రూ.45,000 వరకు ప్రత్యేక ప్రయోజనాలతో వస్తుంది.హ్యుందాయ్ కంపెనీ సాంట్రో, ఐ 20, ఆరా, గ్రాండ్ ఐ 10 ఉన్నాయి. ఈ కార్లలో కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై  గరిష్టంగా రూ.1.5 లక్షల తగ్గింపు ఆఫర్ చేస్తుంది. కోన ఈ‌విపై  ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి అందించట్లేదు.దీని ధర ప్రారంభ ధర  రూ.23.77 లక్షలు కాగా, డ్యూయల్ టోన్ మోడల్ ధర.23.96 లక్షలు (ఢిల్లీ ఎక్స్-షోరూమ్) గా వుంది.


మహీంద్రా ఫ్లాగ్‌షిప్  ఎస్‌యూవీ   అల్టురాస్ జి4 అధికారిక వెబ్‌సైట్‌లో చాలా ఎక్కువగా రూ.3.01 లక్షల వరకు తగ్గింపుతో జాబితా చేశారు. ఆసక్తిగల కొనుగోలుదారులు అల్టురాస్ జి4 ఎస్‌యూవీని 2.2 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు.అంతే కాకుండా  11,500 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్స్ కూడా  ఉన్నాయి.ఈ నెలలో  మహీంద్రా  ఎస్‌యూవీపై 20,000 వరకు ఇతర బెనెఫిట్స్ కూడా కంపెనీ అందిస్తోంది.ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.28.74 లక్షల నుండి. 31.74 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్) ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: