ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా మోటార్స్ (Tata Motors) ఆధునిక కార్లు ఇంకా కమర్షియల్ వాహనాలు విడుదల చేసి ఎప్పటికప్పుడు తన కంటూ ఆటో మొబైల్ పరిశ్రమలో ఒక గుర్తింపు అనేది పొందుతూనే ఉంది. ఇక టాటా మోటార్స్ యొక్క వాహనాలు కేవలం ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లో కూడా ఎక్కువా సంఖ్యలో అమ్ముడవుతూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం కంపెనీ యొక్క నాణ్యత అని చెప్పాలి.అయితే గత కొంత కాలం నుంచి ఇండియన్ ఆటో మొబైల్ పరిశ్రమలోని దాదాపు చాలా కంపెనీలు సెమికండక్టర్ చిప్ కొరతను ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి భారతదేశంలో విజృభించిన కారణంగా ఈ కొరత అనేది ప్రారంభమవ్వడం జరిగింది.ఇక ఈ చిప్ కొరత కారణంగా టాటా మోటార్ కంపెనీ తగిన సంఖ్యలో తమ వాహనాలను ఉత్పత్తి చేయలేకపోతోంది.ఇక అంతే కాకుండా కస్టమర్లకు కూడా సరైన సమయంలో వాహనాలను డెలివరీ చేయలేకపోతోంది.ఇక ఈ కారణంగా కంపెనీ యొక్క అమ్మకాలు అనేవి చాలా వరకు కూడా బాగా క్షీణిస్తున్నాయి.

ఇండియన్ మార్కెట్లో కేవలం టాటా మోటార్స్ కంపెనీ మాత్రమే కాకుండా ఇంకా చాలా కంపెనీలు కూడా ఈ కొరతను ఎదుర్కొంటున్నాయి. దీనిని దృష్టిలో ఊన్చుకుని ఇప్పుడు టాటా మోటార్స్ కంపెనీ ఇండియాలో సెమీకండక్టర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇక దీనికోసం టాటా కంపెనీ ఏకంగా $ 300 మిలియన్స్ డబ్బుని వెచ్చించనుంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దీని విలువ అక్షరాలా రూ. 2,200 కోట్లు.ఇక ఈ ఫ్యాక్టరీ కోసం టాటా గ్రూప్ ప్రస్తుతం కర్ణాటక ఇంకా తమిళనాడు అలాగే తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది. ఈ ఫ్యాక్టరీ 2022 వ సంవత్సరం నాటికి ప్రారభించే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. టాటా కంపెనీ సెమీకండక్టర్ వ్యాపారంలోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు కొంతకాలం క్రితం నివేదించబడటం జరిగింది, అయితే దీని గురించి సమాచారం అనేది బయటకి రావడం ఇదే మొదటిసారి అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: