ఇక ఆటోమొబైల్ పరిశ్రమను సెమీకండక్టర్ సంక్షోభం తీవ్రంగా వెంటాడుతోంది. ప్రస్తుతం,ఈ కార్ల తాళం చెవి మొదలుకొని మొత్తం కారు తయారీలో కూడా ఈ సెమీకండక్టర్ చిప్స్ అనేవి చాలా అధిక సంఖ్యలో ఉపయోగించబడుతున్నాయి. అయితే, వీటి లభ్యత విషయంలో మాత్రం సప్లయ్ కి మించిన డిమాండ్ అనేది ఉంది. ఇక ఈ నేపథ్యంలో, కార్ కంపెనీలు తమ కార్లలో కొన్ని ఫీచర్లను కూడా బలవంతంగా తగ్గించాల్సి వస్తోంది.ఇక కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ ఇటీవల తమ కార్లలో అందిస్తున్న స్మార్ట్ కీ ఫీచర్ విషయంలో ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ ఇప్పుడు తమ కస్టమర్లకు కేవలం ఒకే ఒక స్మార్ట్ కీతో వాహనాలను డెలివరీ చేస్తోంది. మిగిలిన రెండవ స్మార్ట్ కీని కూడా ఆరు నెలల తర్వాత కస్టమర్ ఇంటికి డెలివరీ చేస్తామని కంపెనీ పేర్కొంది. అలాగే హ్యుందాయ్ అనుబంధ సంస్థ అయిన కియా మోటార్స్ కూడా ఇప్పుడు ఇలాంటి మార్గాన్నే అనుసరిస్తోంది. ఈ కియా తమ పాపుల కార్లను ఇప్పుడు కేవలం ఒక్క స్మార్ట్ కీతోనే కస్టమర్లకు డెలివరీ అనేది చేస్తోంది.ఇక సెమీకండక్టర్ చిప్ కొరత ప్రస్తుతం కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉంది.


సెమీకండక్టర్ ఉత్పత్తి ప్రస్తుతం పూర్తి స్థాయిలో జరుగుతున్నప్పటికీ,ఇక దీని లభ్యత మాత్రం డిమాండ్, సప్లయ్ స్థాయిలకు సరిపోవడం లేదు. ఈ సెమీకండక్టర్ల కొరతను ఎదుర్కోవడానికి అనేక ఆటోమోటివ్ కంపెనీలు తమ కార్ల లోని ఫీచర్లు ఇంకా అలాగే సౌకర్యాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల భారతదేశంలో చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ అయిన స్కోడా కూడా తమ కార్లలో ఇన్ఫోటైన్‌మెంట్ సైజును తగ్గించింది.ఇక కియా ఇండియా విషయానికి వస్తే, ప్రస్తుతం ఈ బ్రాండ్ భారత మార్కెట్లో సోనెట్, సెల్టోస్, కారెన్స్ ఇంకా అలాగే కార్నివాల్ అనే నాలుగు ప్యాసింజర్ వాహనాలను విక్రయిస్తోంది. కంపెనీ ఇటీవలే తమ ప్రోడక్ట్ లైనప్ లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు కియా ఈవీ6 ను కూడా జోడించడం జరిగింది. ఇక కియా అందిస్తున్న ఈ కార్లన్నీ కూడా రెండు స్మార్ట్ కీ లతో వస్తాయి. అలాగే ఇవి వినియోగదారులకు కీలెస్ ఎంట్రీ ఇంకా టెలిమాటిక్స్ మరియు నిర్దిష్ట ఫీచర్లకు యాక్సెస్‌ను అందిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: