ఇక ఎప్పట్నుంచో వార్తల్లో ఉంటూ ఇప్పటికీ లాంచ్ కాని మిస్టరీ కారు ఏదైనా ఉందా అంటే అది మారుతి జిమ్నీనే అని చెప్పాలి. ఈ ఆఫ్‌రోడర్ కారు మొత్తానికి ఇక సేల్‌కు రానుంది.కానీ దీని రూపు కూడా మారిపోనుంది. అలాగే కొన్ని ఎంపిక చేసిన విదేశీ మార్కెట్లలో జిమ్నీ ఇప్పటికే అందుబాటులోనే ఉంది. అందులో మూడు డోర్లు ఇంకా పెట్రోల్ ఇంజిన్ పాత 4-స్పీడ్ ఆటోమేటిక్/5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ మోడళ్లు కూడా ఉన్నాయి.మనదేశంలో అయితే ఈ జిమ్నీ ఐదు డోర్లతో లాంచ్ కానుంది. ఇందులో మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ అనేది ఉండనుంది.ఇక ఇది ఇప్పటికే మారుతి కార్లలో అందుబాటులో ఉంది. ఈ ఐదు తలుపుల జిమ్నీ కారులో పొడవైన వీల్ బేస్ ఇంకా డిఫరెంట్ డిజైన్ ఉండనుంది. ముందువైపు ఇంకా వెనకవైపు డోర్లు ఉండటంతో దీని లుక్ కొత్తగా ఉంది. అలాగే ఈ కారులో స్పేస్ కూడా ఎక్కువగా ఉండనుంది.జిమ్నీ ఇప్పటికే మనదేశంలో ఆటో ఎక్స్‌పోలో కూడా కనిపించింది. కానీ అయితే అది గ్లోబల్ స్పెసిఫికేషన్లతో కనిపించింది. మనదేశంలో దీనికి పలు మార్పులు చేసే అవకాశం కూడా ఉంది.


ఇక ఇందులో ఉన్న ఐదు డోర్ల సెటప్‌నే ఈ కారుకు అతిపెద్ద ఆకర్షణ. బ్రెజా తరహాలో పెద్ద టచ్‌స్క్రీన్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఈ కారులో మనం ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు.అలాగే కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా ఇందులో ఉండనుంది. బ్రెజా తరహాలోనే ఇందులో కూడా మైల్డ్ హైబ్రిడ్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందించే అవకాశం కూడా ఉంది. 5-స్పీడ్ మాన్యువల్ ఇంకా 6-స్పీడ్ ఆటోమేటిక్ వేరియంట్ ఉంది. అలాగే ప్రాపర్ 4x4 సిస్టంను కూడా ఈ కార్ లో అందించారు.ఇది ఐదు డోర్ల జిమ్నీ కాబట్టి దీని సైజు కూడా పెద్దదిగానే ఉంటుంది. అలాగే కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో ఉండే ఫీచర్లన్నీ ఇందులో ఉండనున్నాయి. అలాగే దీని ప్రైసింగ్ కూడా ప్రీమియం స్థాయిలోనే ఉండనుంది. ఇక ఈ కారులో అందించనున్న 1.5 లీటర్ ఇంజినే దీనికి కారణం.

మరింత సమాచారం తెలుసుకోండి: