కళాత్మక ఆగ్రహం...!!
కాసుల కోసమే కళ అన్నట్టున్న ఈ సమాజంలో ముగ్గురు యువకులు తమ వరంగల్ లో జరిగిన దుర్మార్గం పై కళాత్మక ఆగ్రహం ప్రకటించారు.
నిన్న వరంగల్లో 9 నెలల పసిబిడ్డ పై జరిగిన అమానవీయ సంఘటనకు నివాళిగా వరంగల్ నగరానికి చెందిన యువ ఆర్టిస్టులు, సుబేదారిలో ప్రధాన రహదారి పక్కనున్న గోడపై పెయింటింగ్ వేసారు.
హరిత్ , వంశీ రంజిత్ లు హైదరాబాద్ లోని, జవహర్ లాల్ నెహ్రు ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసి , కళే ఊపిరిగా బతుకుతున్నారు. సమకాలీస సమాజంలో జరిగే సంఘటనల పై పెయింటింగ్స్ వేస్తుంటారు.