తక్కువ రేటులో బైక్ వస్తుందటే వాహన ప్రియులకు అంతకన్నా భాగ్యమా అనుకుంటారు.  ఇప్పుడు టూవీల్లర్ బైక్స్ సామాన్యులకు సైతం అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా బజాజ్ ఆటో కంపెనీ వారు  కొత్త బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని పేరు సీటీ 110. ఇక ధర విషయానికి వస్తే (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) రూ.37,997 నుంచి ప్రారంభమవుతుంది. ఈ బైక్ రెండు  వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. అవి కిక్ స్టార్ట్, ఎలక్ట్రిక్ స్టార్ట్. కిక్ స్టార్ట్ ధర వచ్చి కూ.37,997గా, ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ.44,480గా ఉంది.


అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ కొత్త బైక్‌ను లాంచ్ చేశామని బజాజ్ ఆటో మోటార్ సైకిల్ బిజినెస్ ప్రెసిడెంట్ సారంగ్ కనడే తెలిపారు.  ఈ బైక్ చూడటానికి చాలా కంఫర్ట్ గా ఉంటుందని..ప్రతి ఒక్కరికీ నచ్చే కలర్స్ తీసుకు వస్తున్నామని..టెక్నాలజీ, స్టైల్ వంటి అంశాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్నారు.   కంపెనీ ఇందులో 115 సీసీ డీటీఎస్-ఐ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అమర్చింది.

ఈ బైక్‌లో ఉన్న మరికొన్ని ప్రత్యేకతలు :
సెమీ నాబీ టైర్స్
అధిక గ్రౌండ్ క్లియరెన్స్
బిగ్గర్ క్రాష్ గార్డ్
అప్‌స్వెప్ట్ ఎక్స్‌హాస్ట్
రబ్బర్ మిర్రర్ కవర్స్


మరింత సమాచారం తెలుసుకోండి: