కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి హ్యూందాయ్ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై ఏకంగా 2 లక్షల రూపాయల వరకు హ్యూందాయ్ కంపెనీ అఫర్ ప్రకటించింది. కళ్లు చెదిరే ఈ ఆఫర్ తో తక్కువ ధరకే కొత్త కారును కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం హ్యూందాయ్ కంపెనీ టస్కన్, ఎలంట్రా, వెర్నా, కెట్రా మొదలైన మోడళ్లపై వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది. 
 
ఆర్థిక మందగమనంతో గత కొన్ని నెలల నుండి కార్ల అమ్మకాలు పడిపోయిన విషయం తెలిసిందే. హ్యూందాయ్ కంపెనీ కార్ల అమ్మకాలు కూడా గతంతో పోలిస్తే తగ్గటంతో ఆఫర్లను ప్రకటించిందని తెలుస్తోంది. త్వరలో రాబోయే దీపావళి పండుగ సందర్భంగా హ్యూందాయ్ ఈ ఆఫర్ ప్రకటించింది. హ్యూందాయ్ లేటెస్ట్ మోడళ్లపై కూడా ఆఫర్లను ప్రకటించింది. కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి కార్లపై భారీ తగ్గింపు శుభవార్త అని చెప్పవచ్చు. 
 
హ్యూందాయ్ టస్కన్ కారుపై 2 లక్షల రూపాయల వరకు, హ్యూందాయ్ ఎలంట్రా కారుపై 2 లక్షల రూపాయల వరకు, హ్యూందాయ్ గ్రాండ్ ఐ 10 మోడల్ కారుపై 95 వేల రూపాయల వరకు, హ్యూందాయ్ ఎక్సెంట్ పై 95 వేల రూపాయల వరకు, హ్యూందాయ్ కెట్రాపై 80 వేల రూపాయల వరకు, హ్యూందాయ్ వెర్నాపై 60 వేల రూపాయల వరకు, హ్యూందాయ్ ఎలైట్ ఐ20 పై 65 వేల రూపాయల వరకు డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిందని సమాచారం. 
 
కొత్త కారు కొనాలనుకునే వారికి ఇంత భారీ స్థాయిలో తగ్గింపులు ఎంతో మేలు చేస్తాయని చెప్పవచ్చు. ఈ భారీ ఆఫర్లతో హ్యూందాయ్ కంపెనీ సేల్స్ కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మిగతా కార్ల కంపెనీలు కూడా దీపావళి పండుగ సందర్భంగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయని తెలుస్తోంది. కొన్ని లేటెస్ట్ మోడళ్లపై మాత్రం హ్యూందాయ్ ఎటువంటి ఆఫర్ ప్రకటించేదని సమాచారం. 




మరింత సమాచారం తెలుసుకోండి: