ఆర్ధికంగా ఇబ్బందులు ఎక్కవగా ఉన్నాయని అపార్ట్ మెంట్ లోని 8వ అంతస్థునుండి  తన ఇద్దరు భార్యలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకముందే పిల్లలను ఇంట్లో హత్య చేసి వీరు ఈ దారుణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..

 

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్ లో చోటుచేసుకుంది. గజియాబాద్ కి చెందిన గుల్షన్ వాసుదేవ్ (45),పర్వీన్, మరో మహిళ సంజన.. ఇద్దరు పిల్లతో కలిసి వైభవ్ కాండ్ ప్రాంతంలోని ఇందిరాపురం అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు. వాసుదేవ్ భార్య పర్వీన్ కాగా... మరో మహిళ సంజనతో ఐదు సంవత్సరాల క్రితం సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా భార్య ప్రర్వీన్ కు తెలిసి జగినట్లు తెలుస్తుంది. దీంతో సంజన ఐదు సంవత్సరాల నుంచి వారితోనే కలిసి ఉంటోంది.


వాసుదేవ్ భార్య పర్వీన్ హౌస్ వైఫ్ గా ఉండేది. సంజన ఓ జీన్స్ ఫ్యాక్టరీలో పనికి వెళ్లేది. వీరికి ఆర్థిక సమస్యలు ఎక్కవగా ఉండేవని తెలుస్తుంది. అయితే వీరు ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ లెటర్ లో "మేము ఆర్ధికంగా చాలా ఇబ్బందిపడుతున్నాం. అందుకే అందరం కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నాం అని..మేము చనిపోతే మా పిల్లలు అన్యాయం అవుతాని వారిని ముందుగా మేమే చంపేస్తున్నామని.. మా చావుకు ఎవరు భాద్యులు కారు అని వ్రాసారు. అంతేకాకుండా తాము చనిపోయిన తారువాత అంత్యక్రియలు చేసేందుకు ఎవరికీ ఏ ఇబ్బంది కలగకుండా డబ్బుకూడా లెటర్ పక్కన పెడుతున్నాం. ఆ డబ్బుతో కుటుంబ సభ్యుల అంత్యక్రియలు నిర్వహించాలంటూ " అని లెటర్ లో వ్రాసారు. 


కాగా చనిపోయిన చిన్నారుల వయసు 15 సంవత్సరాలు ఉండవచ్చని తెలుస్తుంది. అయితే ఆత్మహత్య చేసుకున్న వారిలో వాసుదేవ్, పర్వీన్ అక్కడికక్కడే చనిపోగా సంజన మాత్రం తీవ్రగాయలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో ఆ ప్రాంతం అంతా విషాదఛాయలు అలుముకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: