ఏదో ఒక సమయంలో ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇంలాటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం ఏదో ఒక కొత్తచట్టం తీసుకువస్తూనే ఉంది కానీ.. జరుగుతున్న ఈ దారుణాలు మాత్రం ఆగడంలేదు. 

 

తెలంగాణ రాష్ట్రంలో పశువైద్యురాలిపై జరిగిన అత్యాచారంతో దేశ ప్రజలు వణికిపోతున్నారు. నిందితులను ఊరికే వదలకుండా బాధను అనుభవిస్తూ చంపాలంటూ ప్రతీఒకరు రోడెక్కుతున్నారు. ఈ లాంటి తరుణంలో ఓ శాడిస్టు భర్త తన ఫైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. వివరాల్లోకి వెళితే ..

 

పశువైద్యురాలి అత్యాచార ఘటన మరవకముందే..తాళికట్టిన భార్యను చిత్రహింసలు పెడుతూ.. స్నేహితులతోపాటు కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. 

 

అనంతపురం జిల్లా కదిరికి చెందిన మల్లేశ్ అనే వ్యక్తి తన భార్యపై అమానుషంగా ప్రవర్తించాడు. ఫూల్లుగా మద్యం తాగిన మల్లేశ్ తాళికట్టిన భార్య అనే కనికరం లేకుండా దారుణంగా ప్రవర్తించాడు. మాంగళ్య బంధాన్ని తుంగలో తొక్కాడు. 

 

ఇకపోతే ఈ దారుణానికి ఒడిగట్టిన భర్త మల్లేశ్ గతంలో తొమ్మిదేళ్ల బాలిపై అత్యాచారానికి పాల్పడిన కేసులోజైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలయ్యాడు. జైలుకు వెళ్లి వచ్చిన మల్లేష్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.

 

నిత్యం మద్యం తాగుతూ మానవ మృగంలా ప్రవర్తించేవాడు. అయితే బుధవారం మధ్యాహ్నాం ఫుల్ గా తాగిన మల్లేశ్ తన తన స్నేహితులతో కలిసి భార్యపై దారుణానికి ఒడిగట్టారు. భార్య పాలిట నరరూప రాక్షసుడిగా మారాడు.

 

మల్లేశ్ తన భార్యపై ఆమెకు ఇష్టం లేకుండా అత్యాచారం చేయడమే కాకుండా అంతటితో ఆగకుండా కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసి తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కు సిద్దపడ్డాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

 

నలుగురు నరరూప రాక్షసులు ఆమె పై అత్యాచారం చేయడంతో ఆమె ఆసుపత్రిపాలైంది. ప్రస్తుతం చావు బ్రతుకుల మద్య కొట్టు మిట్టాడుతుంది. అంగన్ వాడి కార్యకర్తలతో కలిసి భాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందులపై రేప్, మర్డర్  కేసులు నమోదు చేసారు. పరారీలో ఉన్న నిందితులు పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: