ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తని సజీవ దహనం చేసిన భార్య . ఈఘటన గత నెల నవంబర్ 26 వ తేదీన జరిగింది. ఈ మిస్టరీని పోలీసులు ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. భాగ్యనగరంలోని వనస్థలిపురంలోని ఎస్ కేడినగర్ లో ఈ ఏడాది నవంబర్ 26వ తేదీన రమేష్ తన గుడిసెలో సజీవ దహనమయ్యాడు. 


రమేష్, స్వప్నలకు గత సంవత్సరం వివాహం జరిగింది. కాని వారి వివాహ బంధం ఎంతోకాలం నిలవలేకపోయింది. భార్య భర్తల మద్య వివాహేతర సంభంధం చిచ్చుపెట్టింది. స్వప్నకు వెంకటయ్య అనే వ్యక్తితో వివాహేత సంభంధం ఏర్పడింది.  ఈ విషయమై భర్త రమేష్ కు అనుమానం కలిగింది. నిజానిజాలు తెలుసుకుని భార్యస్వప్నను మందలించాడు. 

 

అయినా స్వప్నలో మార్పు రాలేదు. దీంతో భార్యాభర్తల మద్య ఎప్పుడు గొడవలు జరుగుతుండేవి. భార్యను కావాలనుకున్న భర్త పెద్దమనుషులమద్య పంచాయతీ పెట్టించాడు. అక్కడ స్వప్న ప్రియుడు వెంకటయ్యతో సంభందాలను తెచుకుంటానని తెల్చిచెప్పింది.కాని స్వప్నలో ఎలాంటి మార్పు రాలేదు. ఇచ్చిన మాట తప్పి మళ్లీ ప్రియుడి మోజులో పడిపోయింది. తన ప్రియుడికి తనకి.. భర్త అడ్డుగా ఉన్నాడని అతని ఏవిధంగానైనా తొలగించుకోవాలనుకుంది. ఇందుకోసం ప్రియుడు వెంకటాచలం సహాయం తీసుకుంది.

 

నవంబర్ 26 తేదీన గుడిసెలో నిద్రపోతున్న భర్తని స్వప్న, అమె ప్రియుడు కలిసి గుడిసె పై పెట్రోల్ పోసి నిప్పంచారు. చెయ్యాల్సింది చేసి ఏమిఎరుగనట్టు స్వప్న తన భర్త షాట్ సర్క్యూట్ తో గుడిసె అంటుకుని మరణించాడని,చుట్టుప్రక్కలవారిని, పోలీసులను నమ్మించింది. 

 

కాని స్వప్న ఎన్నో రోజులు తప్పిచుకోలేకపోయింది. గుడిసెకు ఎదురుగా ఉన్న సిసిటివి ఫుటేజ్ తో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. రమేష్ ప్రమాదవశాత్తు మరణించలేదని, గుడిసెకు పెట్రోల్ పోసి నిప్పటించారని తేలిపోయింది. దీంతో పోలీసులు నిందితురాలిని కష్టడీలోకి తీసుకుని నిలదీసారు. దీంతో స్వప్వ నోరు చెప్పింది. భర్తను తానే ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: