కార్ సర్వీసింగ్.. ఒక్కసారి ఇచ్చాము అంటే.. వాడు కానీ రెండు నుండి మూడు రోజులు సమయం తీసుకుంటాడు. దీని వల్ల కార్ సర్వీసింగ్ చేసే వాళ్ళు తెగ ఇబ్బందులు పడుతుంటారు. ఒక రోజు కార్ సర్వీసింగ్ ఇవ్వడానికి అని వెళ్తే మరో రోజు ఆగి మూడో రోజు తీసుకోవడానికి వెళ్ళాలి. అయితే ఇప్పుడు ఆ భాదలు అన్ని పడాల్సిన అవసరం లేదు.. కేవలం మూడు గంటల్లో కార్ సర్వీసింగ్ చేయించేసుకోవచ్చు. 

 

కార్ సర్వీసింగ్ చాలా ఈజీ.. అది ఎలా అంటే ?  ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన మెర్సిడెస్ బెంజ్ తమ వినియోగదారులకు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఆ ఆఫర్స్ చూస్తే కళ్ళు జిగేల్ జిగేల్ అంటాయి. అంతటి మంచి ఆఫర్స్ ని తెర మీదకు తీసుకువచ్చింది. ఆ ఆఫర్ ను 'ప్రీమియర్ ఎక్స్‌ప్రెస్ ప్రైమ్ సర్వీస్' పేరు మీద సర్వీసింగ్ సేవలను అందిస్తామని మెర్సిడెస్ బెంజ్ సంస్ధ ప్రకటించింది. 

 

కేవలం మూడు గంటల వ్యవధిలోనే వినియోగదారుల కార్లకు పూర్తిస్థాయి సర్వీసింగ్ చేస్తామని ఈ సంస్ద హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఈ ఆఫర్ బెంగళూరు నగరంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్ నగరాలలోను ఈ సేవలను మెర్సిడెస్ బెంజ్ తీసుకురానుంది. ఈ ప్రీమియర్ ప్రైమ్ సర్వీస్ నుంచి వారంటీ మరమ్మతులతో పాటు ప్రధాన సేవలను తీసేసింది. కాగా ఈ సేవలతో వినియోగదారులు కేవలం మూడు గంటల్లోనే కార్ సర్వీసింగ్ చేయించుకోవచ్చు. ఈ సదుపాయం వల్ల వినియోగదారులకు సమయం వృధా అవ్వకుండా సేవ్ అవుతుంది. ఈ సర్వీసులు త్వరలోనే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో ప్రారంభం కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: