యమహా సంస్ద.. ఈ పేరు విని చాలా కాలం అయ్యింది కదా! అందుకే ఈ యమహా సంస్ద నుండి దివిచక్ర వాహనాలు వస్తున్నాయి అంటే యువత ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. భారత్ మార్కెట్లో జపాన్ టూ వీలర్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అలాంటి క్రేజ్ ఉన్న యమహా సంస్ద నుండి మరో కొత్త బైక్ వస్తుంది. 

 

దిగ్గజ ద్విచక్రవాహన సంస్థ సరికొత్త స్కూటర్ లాంచ్ అయింది. అయితే ఈ బైక్ భారత్ లో కాదు.. జపాన్ లో అధునాతన స్పోర్ట్స్ స్కూటర్ ను విడుదల చేసింది. మ్యాజెస్టీ ఎస్ అనే ఈ మ్యాక్సీ స్కూటర్ స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటోంది. యమహా ద్విచక్రవాహనాల్లో ఈ మ్యాక్సీ స్కూటర్ ఎంతో పాపులర్ అయ్యింది. 

 

ప్రస్తుతం ఈ కొత్త స్కూటర్ జపాన్ తో పాటు మలేసియా, ఇండోనేషియా దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇంకా ఈ స్కూటర్ భారత్ లో విడుదల అవ్వడానికి మాత్రం చాలా సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా వచ్చేనెల 14వ తేదీ వరుకు అన్ని క్లోజ్ లోనే ఉంటాయి.. అందుకే ఈ స్కూటర్ లాంచ్ కాస్త ఆలస్యం అవుతుంది. 

 

ఇంకా ఈ స్కూటర్ ధర దాదాపు 2.34 లక్షల రూపాయిలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటం వల్ల మ్యాక్సీ స్కూటర్ ను యమహా సంస్థ తీసుకొస్తుందా లేదా అనే సందేహం ఉంది. మరి ఈ బైకులు అసలు వస్తాయా? రావా అనేది చూడాలి. ఏది ఏమైనా యమహాకు ఉన్న క్రేజ్ ఏ వేరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: