తాజాగా మోటారు వాహనాల రంగంలో '5G' ఇంటర్నెట్‌ విప్లవాత్మక మార్పులు తేబోతుంది. రోడ్లపై వేగంగా దూసుక పోయే కార్లతోపాటు సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లకు '5G' నెట్ ‌వర్క్ ‌ను అనుసంధానం చేయబోతున్నారు. ఇక దీనితో ఏదైనా రోడ్డు మీద వెళుతున్న వాహనాలు ఒకదానికొకటి అతివేగంగా సమాచారం ఇచ్చి అందచేసుకుంటాయి. ఇక దీనితో ముందు ఎదురుకానున్న ప్రమాదాలను ముందే ఊహించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వాహనాలు ప్రమాదాల నుంచి కచ్చితంగా తప్పించుకుంటాయి. ఇంతే కాకుండా ఎదురుగా రోడ్డుపై ఏదైనా గుంతలు వున్నా, రోడ్డుకు అడ్డుగా ఏదైనా ప్రమాదకరమైనవి ఉన్నా, ముందుగా ఉన్న వాహనాల ద్వారా వెనకాల వచ్చే వాహనాలు ఆ విషయాలను తెలుసుకోగలవు.

 

 

ఇకపోతే '5G' సాంకేతిక పరిజ్ఞానాన్ని సెల్ఫ్‌ డ్రైవింగ్‌ వాహనాలు మరింత సమర్థంగా ఉపయోగించుకోగలవని గ్లాస్గో కెలెడోనియన్‌ యూనివర్శిటీ (జీసీయూ) నిపుణలు తెలిపారు. 'టెస్లా కంపెనీ లాంటి కార్లు భవిష్యత్తులో 5g నెట్ ‌వర్క్ ‌ను ఉపయోగించుకొని తమ చుట్టూ కొంత దూరం ఉన్న విస్తీర్ణంలో రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు ఇవి గ్రహిస్తాయి. అంతే కాకుండా రోడ్డుపై ఎక్కడైన గుంతలు లాంటివి ఏవైనా ఉన్నాయా ? లేదా వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇంకా రోడ్డును మంచు కప్పేసిందా ...? గాలి దుమారం ఎదురుకానుందా...? అన్న విషయాలను పూర్తిగా ముందుగానే తెలుసుకొని వాటికి అనుగుణంగా ఆ కార్స్ స్పందిస్తాయి అని భవిష్యత్‌ కార్ల పరిశోధనా బృందం సభ్యుడు డాక్టర్‌ డిమిట్రియాస్‌ లయరోకాపిస్‌ ఈ విషయాన్నీ తెలిపాడు.

 

 

ఇక ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో సంవత్సరానికి పది లక్షల మంది పైగా చనిపోతుంటే, ఐదు కోట్ల మంది గాయాల బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు తెలుపుతున్నాయి. ఇక ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వస్తోన్న కొత్త కార్స్ వల్ల ఈ ప్రమాదాలు చాలా పడిపోతాయని డాక్టర్‌ డిమిట్రియా ఈ విషయాన్ని తెలిపారు. అంతే కాకండా ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'ఫోర్డ్‌' కంపెనీ ఇప్పటికే ఈ దిశగా తన పనులను మొదలు పెట్టిందని, ఈ సంవత్సరం చివరి నాటికి తన కార్లలో 80% కార్లకు కొత్త 5g నెట్‌ వర్క్ ‌ను అనుసంధించాలని లక్షంగా ముందుకు సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: