ప్రపంచం మొత్తం కరోనా వైరస్ దెబ్బకి అతలాకుతలం అయింది. ఈ దెబ్బతో అనేక దేశాల్లో ఆర్థిక పరిస్థితి ఘోరంగా దెబ్బతింది. అంతేకాకుండా అనేక రంగాలలో పురోగతి పూర్తిగా నశించింది అని చెప్పవచ్చు. అందులో ప్రముఖంగా చెప్పుకునేది ఆటోమొబైల్ రంగ సంస్థ. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ఆటోమొబైల్ రంగ సంస్థలు అటు ఉత్పత్తి చేయలేక ఇటు ఉన్న స్టాక్ అమ్ముకోలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే సడలింపుల కారణంగా ఇప్పుడిప్పుడే ఆటోమొబైల్ రంగ సంస్థలు కోలుకుంటున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో ఉన్న స్టాకును ముందుగా అమ్ముకోవాలని ఉద్దేశంతో ఆటోమొబైల్ రంగం సంస్థలు వాటి వాహనాలపై డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకి, హోండా,  హుండాయ్ లాంటి సంస్థలు ఈ నెలకు సంబంధించి కార్లపై భారీ ఆఫర్స్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇక తాజాగా ఈ లిస్టులో రేనాల్డ్ సంస్థ కూడా చేరిపోయింది. ఆ సంస్థ కూడా తన కార్లపై ఓ మోస్తారు ఆఫర్లను ప్రకటించింది. కేవలం క్యాష్ బ్యాక్ మాత్రమే కాకుండా ఎక్స్చేంజ్ బెనిఫిట్ లను కూడా అందించింది కంపెనీ.

 

 

రెనాల్ట్ ట్రైబర్, రెనాల్ట్ డస్టర్ క్విడ్ వాహనాలపై పదివేల రూపాయల ఎక్స్చేంజ్ బెనిఫిట్ మీ కల్పించింది ఆ సంస్థ. ఇక రెనాల్ట్ డ్రైవర్ మోడల్ పై పది వేల రూపాయల రూపాయల లాయల్టీ బోనస్ అలాగే ఏడు వేల రూపాయల కార్పొరేట్ బోనస్ ను అందించబడుతుంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంత వాసులకు ఐతే మరికొన్ని ఆఫర్లను తీసుకువచ్చింది సంస్థ. మామూలుగా రెనాల్ట్ క్విడ్ కార్ ప్రారంభ ధర రూ 2,92000 గా ఉండేది. ఈ వాహనంపై ఇప్పుడు పదివేల రూపాయలు ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ ఇవ్వడమే కాకుండా... 15 వేల రూపాయల ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా కస్టమర్ల ముందుకు తీసుకు వచ్చింది కంపెనీ. అంతేకాకుండా పదివేల రూపాయల వరకు లాయల్టీ బెనిఫిట్స్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక అలాగే కార్పొరేట్ డిస్కౌంట్ వచ్చేసరికి ఈ కారు పై నాలుగు వేల వరకు ఇచ్చింది. అలాగే వివిధ కార్లపై రెనాల్డ్స్ సంస్థ ఓ మాదిరి ఆఫర్లను ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: