ఇండియా టెక్నాలజీ తో పాటుగా పరుగులు పెడుతుంది..ముఖ్యంగా విద్యుత్ వాహనాల పై మరింత ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మార్కెట్ లో కొత్త కొత్త వాహనాలు దర్శనమిస్తున్నాయి. ఒకదానికి మించి మరొకటి అదిరిపోయే రేటు మరియు ఫీచర్లతో పాటుగా సరసమైన ధరలతో మార్కెట్ లో హవాను కొనసాగిస్తున్నాయి. దానికి తోడు విద్యుత్ వాహనాలను అన్నీ కంపెనీలు మార్కెట్ లోకి తీసుకు వస్తున్నాయి.ఏథర్ ఎనర్జీ, ఆంపియర్ వెహికల్స్ లాంటి సంస్థలు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తున్నారు. తాజాగా ఆంపియర్ వెహికల్స్ సంస్థ తన సరికొత్త రియో ఇలైట్ మోడల్ ను మార్కెట్లోకి విడుదల చేశారు..


ఈ స్కూటర్ యొక్క ప్రత్యేకతలు మరియు ధర మొదలగు విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..ఈ ఆంపియర్ రియో ఇలైట్ ఎలక్ట్రిక్ బైక్ చూడటానికి చాలా ప్రత్యేకతలు కలిగి ఉంది.. ముఖ్యంగా చెప్పాలంటే స్టయిల్, అందరూ మెచ్చే సింపుల్ డిజైన్, ఏ కోణంలో చూసినా చూడదగ్గ ఆకృతితో మెరుస్తుంది. పదునుగా కనిపించే యాంగులర్ టర్న్ ఇండికేటర్స్ తో ముందుభాగం ప్రత్యేకంగా ఉంది. వెనక వైపు అబ్బురపరిచే ఎల్ఈడీ హెడ్ లైట్లతో స్టైలిష్ గా ఉంది. రెడ్, బ్లాక్ కాంబినేషన్ లో ఈ బైక్ చూపరులను ఆకట్టుకుంటుంది.సీటింగ్ అరేంజ్ మెంట్ విషయానికొస్తే.. ఇలైట్ స్కూటర్ కు సింగిల్ పీస్ యూనిట్ ను ఒకే సీట్ గా రూపొందించారు. హ్యాండిల్ పొజిషన్ కూడా డ్రైవ్ చేసేందుకు అనువుగా ఉంటుంది..



ఇకపోతే ఈ బైక్ రేంజ్ విషయానికొస్తే.. ఒకసారి ఫుల్ గా ఛార్జింగ్ పెడితే..50 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. ఆంపియర్ గత మోడళ్లలో గరిష్ఠంగా 75 కేజిల బరువు మోసే సామర్థ్యం మాత్రమే అందుబాటులో ఉండేది. తాజాగా వచ్చిన రియో ఇలైట్ లో గరిష్ఠంగా 120కేజీల వరకు లోడ్ కెపాసిటీ ఉంది. ఇంత తేలికగా ఉన్న ఈ స్కూటర్ రోడ్డుపై దూసుకెళ్తుంది.. ఇద్దరు కూర్చోవడానికి అనువుగా కూడా ఈ బైక్ ఉంటుంది.. అందుకే ఏడాది మొదట్లో మార్కెట్ లోకి వచ్చిన ఈ బైక్ లు ఇప్పటికే అంతే రేంజులో అమ్మకాలు జరుగుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: