ప్రస్తుతం బండి మీద వెళ్ళాలంటే గుండెలు పగిలేలా భయపడుతున్నారు..ఎందుకంటే బండి దాహార్తిని తీర్చే పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. లీటర్ పెట్రోల్ వందకు పైగా చేరింది..కొన్ని రాష్ట్రాల్లో వాహనాలు మానేసి ఎంత టైం వేస్ట్ అయినా కూడా ఏ బస్సుల్లో లేదా ట్రైన్ లలో ప్రయాణిస్తున్నారు. కాగా, ఇప్పుడు పెట్రోల్ అవసరం లేకుండా కొన్ని రకాలా  మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.. ప్రముఖ కంపెనీలు ఇటువంటి బైక్ లను మంచి ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది.. అదేంటో వివరంగా తెలుసుకుందాం..


వాహనదారులు కూడా ఎలెక్ట్రిక్ వాహనాల వైపు మక్కువ చూపిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కి చెందిన ప్రముఖ స్టార్టప్ కంపెనీ ఆటమ్ మొబైల్ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేసింది. పైగా లైసెన్స్, పెట్రోల్ అవసరమే లేదు. ఇక ఈ టూ వీలర్ ఫీచర్స్ ని కనుక చూస్తే.. సూపర్ టెక్నాలజీ తో దీనిని తయారు చేయడం జరిగింది.గంటకు గరిష్టంగా 25 కిలో మీటర్ల వేగం తో ప్రయాణిస్తుంది అని కంపెనీ చెప్పింది. దీని బరువు వచ్చేసి దీని బరువు 35 కేజీలు మాత్రమే. ఈ బైక్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ 48 ఓల్డ్ 250 వ్యాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో పని చేస్తుంది. పైగా ఇది నాలుగు గంటల్లోనే ఛార్జ్ అయి పోతుంది.  


బైక్ కు మరో ప్రత్యేకత కూడా ఉంది. డిజిటల్ డిస్ప్లే కూడా ఉంది .ఈ డిస్ప్లే లో బ్యాటరీ స్టేటస్, స్పీడ్, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాము వంటివి చూడవచ్చు.ఇప్పటి వరకు 400 పైగా యూనిట్లో బుక్ చేసుకున్నట్లు సమాచారం. ఈ బైక్ డెలివరీలు కూడా స్టార్ట్ అయ్యాయి. హైదరాబాద్ , న్యూ ఢిల్లీ , కోల్కతా, చెన్నై, బెంగళూరు వంటి నగరాలలో ఆటమ్ 1.0 బైక్ ను అందించనుంది. ఈ బైక్ వలన లైసెన్స్ పెట్రోల్ అవసరం లేదు పైగా చలానాలు కూడా పడవు.. ఈ బైక్ యువతలో క్రేజ్ ను తెచ్చుకుంది. చాలా మంది ఈ బండిని కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. కాదా, స్టైల్ లుక్ కూడా ఈ బండికి క్రేజ్ ను తీసుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: