ఈ రోజుల్లో సందర్భం ఏదైనా కేక్ కటింగ్ మాత్రం కామన్. కేక్ కట్ చేసి ఆ ఈవెంట్ ని  హ్యాపీగా గడుపుకుందాం అనుకుంటారు. కానీ పుట్టిన రోజు సందర్బంగా తెచ్చిన కేక్ తినటం వల్ల ప్రాణాలే కోల్పోతే . వినటానికి షాకింగ్గా ఉన్న...ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. టైం బాలేకపోతే మృత్యువు ఎక్కడి నుండి అయినా రావొచ్చు అని అంటుంటారు. వీళ్ల కుటుంబాన్ని కేక్ రూపంలో మృత్యువు కబళించింది. ఎంతో సంతోషంగా పుట్టిన రోజు వేడుకను జరుపుకున్న వారి కుటుంబంలో కేక్ విషాదం నింపింది. 


సిద్ధిపేట జిల్లా  కొమరవెల్లి మండలం ఐనాపూర్‌ గ్రామానికి చెందిన రమేష్, భాగ్యలక్ష్మి దంపతులకు కుమారుడు రామ్ చరణ్, కూతురు పూజిత ఉన్నారు. కాగా తమ కుమారుడి తొమ్మిదవ పుట్టిన రోజు సందర్బంగా ఎంతో సంతోషంగా కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుందాం అని సిద్ధమయ్యారు. ఇంట్లో కేక్ కట్ చేసి ఒకరికొకరు తిని పించుకొని హ్యాపీగా గడిపారు.


 ఎంతో ఆనందంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాం అని సంతోషంగా ఉన్న ఆ కుటుంబాన్ని కొద్దీ సమయంలోనే మృత్యువు ఛిన్నాభిన్నం చేసింది. కేక్ తిన్న తండ్రి రమేష్, కొడుకు రామ్ చరణ్ మృతి చెందగా..భార్య భాగ్యలక్ష్మి, కుమార్తె పూజితల పరిస్థితి విషమంగా ఉంది. 
అయితే ఈ సంఘటనపై రమేష్ సోదరుడిపై అనుమానం వ్యక్తం అవుతుంది. ఈ కేక్ ను రమేష్ సోదరుడు పంపించాడు. వీరి మధ్య చాలా కాలంగా భూతగాద కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కేక్ లో విషం కలిపి పంపించినట్లు పొలీసులు భావిస్తున్నారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: