మారుతి సుజుకి నుండి ఎంపివి వెహికల్ ఎర్టిగా కొత్త వెహికల్ లాంచ్ అవుతుంది. బిఎస్ 6 నామ్స్ ప్రకారంగా ఈ వెహికల్ మార్కెట్ లో రిలీజ్ అవుతుంది. ఇక ఈ వెహికల్ ధర 7.55 లక్షల ఎక్స్ షోరూం ప్రైజ్ తో వస్తుంది. ఎల్.ఎక్స్.ఐ ట్రిం వర్షన్ ఏడున్నర లక్షల దాకా ప్రైజ్ ఫిక్స్ చేయగా జెడ్.ఎక్స్.ఐ వెహికల్ కు 10.50 లక్షలకు ప్రైజ్ ఫిక్స్ చేశారు. 


1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్న ఈ వెహికల్ 105 బి.హెచ్.పి, 138 ఎన్.ఎం టార్క్ తో అందుబాటులోకి వస్తుంది. ఈ వెహికల్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ తో అందుబాటులోకి వస్తుంది. బిఎస్ 6 నామ్స్ తో మారుతి సుజుకి నుండి వస్తున్న ఈ సరికొత్త వెహికల్ అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది.


మారుతి సుజుకి ఎర్టిగా సక్సెస్ ఫుల్ వెహికల్ గా మంచి సేల్స్ కలిగి ఉంది. ఇప్పుడు కొత్తగా బిఎస్ 6 నామ్స్  తో ఈ వెహికల్ సరికొత్త హంగులతో వస్తుంది. ఆల్రెడీ మార్కెట్ లో లాంచ్ అయిన ఈ వెహికల్ కస్టమర్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కచ్చితంగా మారుతి సేల్స్ రేటు పెంచేలా ఎర్టిగా బిఎస్ 6 వెహికల్ సేల్స్ ఉంటాయని చెప్పొచ్చు.   


మరింత సమాచారం తెలుసుకోండి: