ఐఐటీ మద్రాసులో 21 ఏళ్ల తమిళనాడు యువతి చరిత్ర సృష్టించారు. ప్రధాని మోదీ సమక్షంలో జరిగిన 56వ స్నాతకోత్సవంలో విద్యార్థిని కవితా గోపాల్‌ ‘రాష్ట్రపతి’ బంగారు పతకం అందుకొన్నారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక క్యాంపస్ లలో ఐఐటీలను చెబుతుంటారు. అలాంటి ఐఐటీల్లో మద్రాస్ క్యాంపస్ కున్న పేరు ప్రఖ్యాతులు తక్కువేం కాదు.  ఆ క్యాంపస్ అరవైఏళ్ల చరిత్రను బ్రేక్ చేసిందో ఒక అమ్మాయి. ఇప్పటివరకూ మరే యువతి సాధించని అద్భుత విజయాన్ని సొంతం చేసుకొని రికార్డుగా మారారు కవితా గోపాల్.

మద్రాస్ ఐఐటీ స్నాతకోత్సవంలో 21 ఏళ్ల తమిళనాడుకు చెందిన కవితా గోపాల్ రాష్ట్రపతి బంగారు పతకాన్ని సాధించి ఒక పెద్ద హిస్టరీ క్రియేట్ చేసింది. 60 ఏళ్ల మద్రాస్ ఐఐటీలో తొలిసారి ఈ ఘనతను సాధించిన అమ్మాయిగా ఆమె నిలిచింది. అంతేకాదు.. మరో రెండు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.

తమిళనాడులోని కాంచీపురం జిల్లా అణుపురంలోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూలు.. కల్పాకంలోని కేవీవీలో చదివిన కవిత 2015లో ఐఐటీ మద్రాస్ లో సీఎస్ఈ (కంప్యూటర్ సైన్స్)లో చేరారు. ప్రస్తుతం ఆమె గూగుల్ లో ఐటీ ఇంజనీర్ గా పని చేస్తున్నారు కూడా.

మద్రాస్ ఐఐటీలో సీఎస్ ఈలో 9.95 గ్రాండ్ స్కోర్ తో రికార్డు క్రియేట్ చేయటమే కాదు.. ఎం. విశ్వేశ్వరయ్య స్మారక పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఈ అవార్డును సొంతం చేసుకున్న తొలి మహిళగా ఆమె నిలిచారు. మూడు అవార్డుల్ని పొందటంపై ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.కవితా గోపాల్ ఇలాంటి పతకాలు చాల సాధించాలని కోరుచున్నాము.ఈ అవార్డులను పొందటం తనకు అమితానందాన్ని కలిగిస్తోందని కవితా గోపాల్‌ చెప్పారు. కవితా గోపాల్‌ సాధించిన చరిత్ర  60 ఏళ్ల మద్రాస్ ఐఐటీలో పెద్ద రికార్డుగా నిలిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: