చాలామంది కూడా పింపుల్స్, బ్లాక్ హెడ్స్ లాంటి సమస్యలను తగ్గించుకోడానికి మార్కెట్లో లభించే వివిధ కెమికల్స్ తో కూడిన క్రీమ్స్, సౌందర్య లేపనాలను వినియోగిస్తున్నారు. మరికొంతమంది అయితే వైద్యులను సంప్రదించి ఖరీదైన చికిత్సలని చేయించుకుంటున్నారు.అయితే ఇలా చేయడం స్కిన్ కే కాదు ఆరోగ్యానికి కూడా చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అందుకే ఇందుకు బదులుగా ఇంట్లో ఉండే న్యాచురల్ పదార్ధాలతో చాలా ఈజీగా ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.ఇక మీరు ఒక గిన్నె బియ్యాన్ని తీసుకొని వాటిని సుమారు ఒక 30 నిమిషాలు నానబెట్టి, ఆ నీటిని కాటన్ సహాయంతో మీ ముఖంపై రాయండి. సుమారు ఒక అరగంట దాకా ఉంచి తరువాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చాలా సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.ఇంకా అలాగే నిమ్మకాయలో బ్లీచింగ్ లక్షణాలు, బంగాళాదుంపలో కొన్ని ఎంజైమ్‌ చర్మాన్ని కాంతివంతంగా చేసేందుకు చాలా బాగా సహాయపడతాయి.


అందుకే చర్మ సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్న వారు ప్రతి రోజు నిమ్మ బంగాళదుంప మిశ్రమాన్ని వారి చర్మానికి అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన మిశ్రమాన్ని ఒక 25 నుంచి 30 నిమిషాల పాటు ఉంచి చల్లని నీటితో ముఖాన్ని బాగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇలా వారానికి మూడు రోజులపాటు చేస్తే చాలా సులభంగా మీరు మంచి ప్రయోజనాలని పొందుతారు.అలాగే తేనె కూడా చర్మానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి ఈజీగా ఉపశమనం కలిగించడమే కాకుండా.. చర్మంపై ఉన్న అన్ని రకాల సమస్యల నుంచి 15 రోజుల్లో ఉపశమనం కలిగిస్తాయని చర్మ సౌందర్య నిపుణులు చెబుతున్నారు.ఇందు కోసం తేనెను మీ ముఖానికి అప్లై చేసి ఒక 20 నిమిషాల తర్వాత మంచినీటితో బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. వీలైతే ఇందులో నిమ్మరసం ని కూడా మీరు వాడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: