బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి.. దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజలకు వైఎస్ఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారని... రాజన్న బాటలోనే ఆయన తనయుడు సీఎం జగన్ పేదప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని మంత్రి బాలినేని అన్నారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి.. దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజలకు వైఎస్ఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారని... రాజన్న బాటలోనే ఆయన తనయుడు సీఎం జగన్ పేదప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని మంత్రి బాలినేని అన్నారు.