18 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ పెట్టి.. విద్యుత్ రంగంపై 2వేలకోట్ల భారం పెంచడం అవసరమా? అని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. రైతులు వ్యతిరేకిస్తున్నా మీటర్ బిగింపు వెనక మతలబేంటని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్కి మంగళం పాడేందుకేనా ఈ మీటర్లని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నగదు బదిలీని వైఎస్ఆర్సిపి వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతులు, నిపుణులు అడుగుతున్న ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు.

ఏపీ మంత్రి కొడాలి నాని, తెలుగుదేశం నేత దేవినేని ఉమామహేశ్వరరావు మధ్య మాటల తూటాలుపేలాయి. డ్రైవర్లను విమర్శిస్తే ప్రమాదమని మంత్రి హెచ్చరిస్తే... ఇలాంటి తాటాకుచప్పుళ్లకు భయపడేది లేదని ఉమ కౌంటర్ ఇచ్చారు. మాటలు జాగ్రత్తని మంత్రి అంటే... భాష మార్చుకోవాలని మాజీ మంత్రి హితబోధ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: