ఐపిఎల్ లో మొదటి మ్యాచ్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. ముంబై చెన్నై జట్లు రెండు కూడా విజయం కోసం చివరి వరకు పోరాటం చేయగా చెన్నై చివర్లో మెరుపులు మెరిపించడంతో  విజయం సాధించింది. దీనిపై టీం ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ట్విట్టర్ లో అతను ఒక ట్వీట్ చేసాడు.

ఐపీఎల్‌కు గొప్ప ప్రారంభం అని అన్నాడు. ఇది టోర్నమెంట్ యొక్క క్రాకర్ అవుతుందనిపిస్తోందని ట్వీట్ లో పేర్కొన్నాడు. అంబటి రాయుడు మరియు ఫాఫ్ డు ప్లెసిస్ తెలివైన వారని అతను పేర్కొన్నాడు. కాని చివరికి సామ్ కుర్రాన్ యొక్క అతిధి పాత్ర పోషించాడని తన ట్వీట్ లో కీర్తించాడు. ఇడ్లీ మళ్లీ వడా పావ్‌ ను ఓడించింది అని సెహ్వాగ్ తన మార్క్ పంచ వేసాడు. కాగా నేడు పంజాబ్ ఢిల్లీ మధ్య మ్యాచ్ జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: