చెన్నై సూపర్​కింగ్స్​కు ఐపీఎల్​లో మరో పరాభవం ఎదురైంది. బెంగళూరు బౌలర్ల సమష్టి దెబ్బకి విలవిల్లాడింది. 170 పరుగుల లక్ష్య ఛేదనకు దిగి 132/8కే పరిమితమైంది. ఏకంగా 37 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. అంబటి రాయుడు (42), జగదీశన్‌ (33) మినహా మరెవ్వరూ రాణించలేదు. మరోవైపు కోహ్లీసేన నాలుగో విజయంతో 8 పాయింట్లతో తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుంది. ప్లేఆఫ్‌కు రేసులో నిలిచింది. అంతకు ముందు బెంగళూరులో విరాట్ కోహ్లీ (90*) దుమ్మురేపాడు.


అంతకుముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న బెంగళూరును ధోనీసేన బౌలర్లు అదరగొడుతున్నా.. ఆరంభంలో పరుగులేమీ రాకున్నా.. విరాట్ కోహ్లీ (90*) ఒక్కడే విధ్వంసం సృష్టించాడు. మైదానంలో అద్భుతమైన బౌండరీలు.. కళ్లు చెదిరే సిక్సర్లతో చెలరేగాడు. అతడికి తోడుగా శివమ్‌ దూబె (22*), దేవదత్‌ పడిక్కల్‌ (33) రాణించడం వల్ల ధోనీసేనకు బెంగళూరు 170 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: