ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో చాలా మంది ఆయనకు విష్ చేస్తున్నారు. ఇక పలు ప్రాంతాల్లో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలను కరోనా ఉన్నా సరే చాలా వరకు కూడా జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. ఇక పలువురు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో విష్ చేస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక దారుణ సంఘటన జరిగింది. కాళ్ల మండలం ఎల్ ఎన్ పురంలో విషాదం చోటు చేసుకుంది.

హీరో  ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీ కడుతున్న నలుగురు యువకులు కరెంట్ షాక్ కి గురయ్యారు. ఫ్లెక్సీకి విద్యుత్ వైర్లు తాకడంతో గండికోట దుర్గా ప్రసాద్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డ మిగతా ముగ్గురు యువకులు... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: