వైసీపీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఆయ‌న సోద‌రుడు మంగ‌ళ‌గిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది. వీరి స్వ‌గ్రామం అయిన పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని పెద‌కాకాని మేజ‌ర్ పంచాయ‌తీని టీడీపీ గెలుచుకుంది. వైసీపీలో కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న ఈ ఇద్ద‌రు సోద‌రులు త‌మ సొంత మేజ‌ర్ పంచాయ‌తీని గెలిపించుకోలేక‌పోయారు. గ‌త ట‌ర్మ్‌లో వీరి త‌ల్లి ఇక్క‌డ స‌ర్పంచ్ గా గెలిచారు. ఈ సారి మాత్రం వీరికి చుక్కు ఎదురు అయ్యింది. ఈ పంచాయితీలో టీడీపీ అభ్యర్థి 73ఓట్ల మెజార్టీతో గెలుపు సాధించారు. ఈ గెలుపు ఇప్పుడు గుంటూరులో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: