ముఖ్యమంత్రి కేసీఆర్ ను పిచ్చికుక్కతో పోల్చారు బిజెపి నేత మోత్కుపల్లి. పీవీ మీద కోపంతోనే ఆయన కుమార్తెను ఎమ్మెల్సీగా కేసీఆర్ పోటీలో పెట్టాడు అని ఆయన ఆరోపించారు. పీవీ నరసింహారావు మీద కేసీఆర్ తన కసిని తీర్చుకోవాలనుకుంటున్నాడు అని ఆరోపించారు. ఓట్లేసిన గెలిపించిన ప్రజలను చెప్పుతో పోల్చిన  నీచుడు కేసీఆర్ అని విమర్శలు చేసారు. కుటుంబం కోసమే బతుకుతున్న సీఎం కేసీఆర్ అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

ఫాంహౌస్ ను భవిష్యత్ లో ప్రజలు తీసుకోవటం‌ ఖాయం అని అన్నారు. ఆత్మబలిదానాలు చేసిన కుటుంబాల రక్తం కేసీఆర్ తాగుతున్నాడు అని మండిపడ్డారు. యాదగిరిగుట్ట గుడిలో తన బొమ్మ చెక్కించుకున్నప్పుడే కేసీఆర్ పతనం ప్రారంభమైంది అని ఆరోపించారు. భద్రాచలం రాముడంటే కేసీఆర్ కు లెక్కలేని తనం  అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: