తిరుప‌తి లోక్‌స‌భ స్థానం ఉప ఎన్నిక‌కు సంబంధించి బీజేపీ - జ‌న‌సేన మధ్య వివాదానికి తాత్కాలికంగా తెర‌ప‌డింది. కొద్దిరోజులుగా ఇక్క‌డి నుంచి తాము పోటీచేయాలంటే తాము పోటీచేయాలంటూ బీజేపీ, జ‌న‌సేన పార్టీకి చెందిన నేత‌లు వాగ్వాదాలాడుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే తిరుప‌తి నుంచి తమ పార్టీ అభ్య‌ర్థి పోటీ చేస్తున్న‌ట్లు బీజేపీ నేత ముర‌ళీధ‌ర్ ట్వీట్ ద్వారా వెల్ల‌డించారు. జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలిసే ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. తిరుపతి నుంచి బీజేపీ విజయయాత్ర మొద‌ల‌వ‌బోతున్న‌ట్లు ముర‌ళీధ‌ర్ ప్ర‌క‌టించారు. బీజేపీ అభ్యర్థే బరిలో దిగుతారని ప్రకటించి.. ఇరుపార్టీల మ‌ధ్య ఉన్న వివాదానికి ఇంత‌టితో ముగింపు ప‌లికిన‌ట్ల‌యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: