తిరుపతి ఉపే ఎన్నికలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఎన్నికల విషయంలో టీడీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. టీడీపీ అగ్ర నేతలు అందరూ కూడా తిరుపతి పార్లమెంట్ లో ప్రచారం కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు తిరుపతిలో హాట్ టాపిక్ గా మారాయి. అధికార పక్షాన్ని టార్గెట్ గా చేసుకుని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.

“ఇక ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ విజయసాయి రెడ్డి లోకేష్ ని ఉద్దేశించి ట్విట్టర్ లో ఎద్దేవా చేసారు. మండుటెండల్లో మాలోకం తన పిచ్చి కామెడీతో తిరుపతి ఎన్నికల ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నాడు. ఎండలు తగ్గించి ఉపశమనం కలిగిస్తానని తండ్రిలాగే హామీ ఇచ్చేలా ఉన్నాడు. తిరుపతిలో టీడీపీని గెలిపిస్తే గ్యాస్, పెట్రోలు ధరలు తగ్గిస్తాడట. నమ్మాల్సిందేనా?” అంటూ ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: