తిరుపతి ఉప ఎన్నికలు ఏమో గాని ఇప్పుడు టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారం మాత్రం కాస్త హాట్ టాపిక్ గా ఉంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలా అయినా సరే గెలిచే విధంగా టీడీపీ నేతలు కష్టపడుతున్నారు. ఈ నేపధ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పీచ్ బాగా హైలెట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఆయన కాస్త గట్టిగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో చిన్న చిన్న తప్పులు కూడా బయటకు వస్తున్నాయి.

పెన్షన్ లు పెంచుతా అని లోకేష్ ఇచ్చిన హామీపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు. “ఎండలు ముదిరే కొద్దీ చిట్టి నాయుడి  చిత్త భ్రమ పీక్స్ కు పోతున్నది.  ఇంకా  అధికారంలోనే ఉన్నట్లు భ్రమపడుతున్నాడు. వృద్ధాప్య పెన్షన్ పెంచేస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నాడు. ఆయిల్ రేట్లు తగ్గిస్తానని మొన్న  చేసిన కామెడీ నుంచి జనం తేరుకోకముందే ఇంకో బాంబు పేల్చాడు!"

మరింత సమాచారం తెలుసుకోండి: