ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి గెలుపు ఖాయమయిపోయిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇక్కడ పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే ఉందన్నారు. ఈ ఉప ఎన్నిక‌ల్లో గెలుపు కోసం సీఎం కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా సాగర్ లో ప్రజలు పట్టించుకోరన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ ఎన్నికల్లో స్పష్టంగా కన్పిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దుబ్బాక‌లో కేసీఆర్‌కు ప్ర‌జ‌లు ఎలా ఝుల‌క్ ఇచ్చారో సాగ‌ర్లో కూడా టీఆర్ఎస్‌ను ఓడించి ఆయ‌న‌కు షాక్ ఇచ్చేందుకు ప్ర‌జ‌లు రెడీగా ఉన్నార‌ని చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: