సిపిఎం మాజీ ఎమ్మెల్యే, భద్రాచలం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన కుంజా బొజ్జి అనారోగ్యంతో మరణించారు. 95 ఏళ్ళ బొజ్జి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పోందుతు సోమవారం ఉదయం  కన్నుమూసారు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఆయన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

అయితే అంతా బాగుందని ఇంటికి రాగా మళ్ళీ అనారోగ్యం బారిన పడ్డారు. కుంజా బొజ్జి 1985,1989,1994 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయనకు ఇప్పటికీ సొంత ఇల్లు లేదని చెప్తారు. పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వంలో పని చేసిన ఆయన సొంత ఊరు తూర్పు గోదావరి జిల్లా వి.ఆర్.పురంలోని అడవి వెంకన్న గూడెం. మూడేళ్ళ క్రితం ఆయన భార్య కూడా కన్నుమూసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: