ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరిక్షలు కాస్త హాట్ టాపిక్ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎలా అయినా సరే నిర్వహించాలని పట్టుదలగా ముందుకు వెళ్ళడంపై ఇప్పుడు విపక్షాలు గట్టిగానే ఆరోపణలు చేస్తున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాస్త గట్టిగానే ఈ అంశానికి సంబంధించి పోరాటం చేస్తున్నారు. తాజాగా దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లోకేష్ టార్గెట్ గా ట్వీట్ చేసారు.

లోకేశ్ లాంటి వింత జీవి భూమ్మీద ఇంకెక్కడా కనిపించడు అని ఎద్దేవా చేసారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు తనే రాసాడో, బాబు ఇంకెవరితోనైనా రాయించాడో! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. పిల్లల భవిష్యత్తును నాశనం చేయడానికి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు అని మండిపడ్డారు. కరోనా ప్రోటో కాల్స్ ప్రకారమే ఎగ్జామ్స్ జరుగుతాయి అని నీ బాధేంటి పప్పు నాయుడు? అంటూ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: