ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఇప్పుడు వాక్సిన్ అనేది చాలా కీలకంగా మారింది. వాక్సిన్ ని ప్రజలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు సిద్దమవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఏపీలో వాక్సిన్ ని ఉచితంగా 18 ఏళ్ళు పైబడిన వారికి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై కేంద్రం కంటే ముందు ఏపీ ప్రభుత్వమే ప్రకటన చేసింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ ను అభినంధించలేదు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు.

“18-45 మధ్య వయసు వారికి ఉచిత వ్యాక్సిన్లు ఇస్తామని మొదట ప్రకటించింది సిఎం జగన్ గారే. ఆ తర్వాతే కేంద్రం ఫ్రీ వ్యాక్సిన్ నిర్ణయం వెల్లడించింది. కరోనాపై కేంద్రానికి నివేదికలు పంపుతుంటానని డప్పు కొట్టుకునే బాబుకు ఇది కనిపించలేదా. విషం చిమ్మడమే కాదు. మెచ్చుకోవడం కూడా నేర్చుకో బాబూ.” అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: