గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. సంగం డెయిరీ అక్ర‌మాస్తుల కేసులో ఆయ‌నపై ఉన్న కేసుల నేప‌థ్యంలో జైలులో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు క‌రోనా సంక్ర‌మించింది. దీంతో ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణ కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ స‌భ్యుల కోర్టులో పిటిష‌న్ వేయ‌డంతో ప‌రీక్ష‌లు చేయ‌గా ఆయ‌న‌కు క‌రోనా వ‌చ్చిన‌ట్టు తేలింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: