తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. లాక్‌డౌన్‌ నుంచి పెట్రోల్‌ బంకులకు తెలంగాణ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్ నుంచి పెట్రోల్‌ బంకులకు మినహాయింపు ఇచ్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెట్రోల్‌ బంకులను సాధారణ సమయాల్లో తెరిచేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ధాన్యం సేకరణ, మిల్లులకు రవాణా చేయడం వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని మినహాయింపు ఇచ్చినట్లు ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. జాతీయ రహదారుల వెంబడి ఉన్న పెట్రోల్‌ బంకులకు లాక్‌డౌన్ నుంచి ఇప్పటికే పూర్తి మినహాయింపు ఉన్న విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: