ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కర్ఫ్యూ ఉన్నా సరే కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో కర్ఫ్యూను మళ్లీ పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి నివారణకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఈ మేరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు..


జూన్ పదో తారీకు వరకు కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లుగా ప్రకటన వెలువడింది. ఇక ఇప్పటికే అమలులో ఉన్న ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు సడలింపు అలాగే కొనసాగనుంది. ఇక మరో పది రోజుల తర్వాత మళ్లీ సమీక్ష సమావేశం నిర్వహించి కేసులు తగ్గుదలను బట్టి ఆంక్షల సడలింపు ఉండే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: