పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా మహ్మామ్మారికి రోజుల వ్యవధిలోనే తల్లికొడుకు మృతి చెందడం విషాదం కలిగించింది. జిల్లాలోని ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన గంటా తాతాజీకి ఈ నెల 5వ తేదీన కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.అయితే కుంటుంబ సభ్యులంతా ప్రైమరీ కాంటాక్ట్ కింద పరీక్షలు చేయించుకోగా ఆయన తల్లి అన్నపూర్ణకి కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.వీరిద్దరూ ఇంటి నుంచే చికిత్స తీసుకున్నారు.పరిస్థితి విషమంగా ఉండటంతో ఇద్దరిని మూడు రోజుల వ్యవధిలోనే ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ నెల 10వ తేదీన తాతాజీ తల్లి అన్నపూర్ణ మరణించగా..నిన్న తాతాజీ కూడా చికిత్స పొందుతూ మరణించారు.ప్రస్తుతం తాతాజీ
భార్య ఎనిమిది నెలల గర్భిణిగా ఉంది. రోజుల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందడం గ్రామంలో విషాదం నెలకొంది.