సంగం డెయిరీ కేసులో కంపెనీ సీఈఓ పెద్ది సాంబ‌శివ‌రావు, మాజీ ఎండీ గోపీనాథ్‌ల‌కు హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. వీరిద్ద‌రికి హైకోర్టు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది.సంగం డెయిరీలో భారీగా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ఏసీబీ అధికారులు కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో సంగం డెయిరీ ఛైర్మ‌న్ ధూళిపాళ్ల న‌రేంద్ర‌ను అరెస్ట్ చేశారు. 14 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్న న‌రేంద్ర‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో ఏసీబీ మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు చేస్తుంది. సంస్థ‌లో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌ను కూడా విచారిస్తుంది. సంగం డెయిరీలో భారీగా అక్ర‌మాలు జ‌రిగాయ‌ని పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశ‌య్య ఆరోపించారు. అయితే సంగం డెయిరీ రైతుల‌ద‌ని...రైతుల‌కు ఆర్థికంగా లాభాలు ఇచ్చే సంగం డెయిరీని నిర్వీర్యం చేసేందుకు ప్ర‌భుత్వం కుట్ర చేస్తుంద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నారు. సంగం డెయిరీ ఛైర్మ‌న్‌గా ఉన్న ధూళిపాళ్ల న‌రేంద్రపై ప్ర‌భుత్వం క‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: