కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ పై మాజీ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మాణిక్యం ఠాకూర్ యూజ్లెస్ నెంబర్ వన్ టు ఆయన కాసేపటి క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దుయ్యబట్టారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు.

40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళు నన్ను కాదని తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఏ విధంగా అప్పగిస్తారని.. అంటూ   ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్న తర్వాత తనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేశారని రాజీనామా చేయవద్దని విజ్ఞప్తి చేశారని కౌశిక్ రెడ్డి మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: