ఏపీ సీఎం జగన్‌కు కొరకరాని కొయ్యగా మారిన ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు బిగ్ షాక్ తగిలింది. లోక్‌సభ స్పీకర్ కార్యాలయం ఆయనకు బిగ్ షాక్ ఇచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం ఎంపీ రఘురామ కృష్ణంరాజు నోటీసులు పంపింది. ఈ మేరకు ఎంపీ రఘురామకు లోక్‌సభ సచివాలయం నుంచి తాకీదులు వచ్చాయి.

ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎప్పటి నుంచో  స్పీకర్‌ను కోరుతోంది. అనేకసార్లు వైకాపా ఎంపీలు స్పీకర్‌ను కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. తాజాగా ఇటీవల స్పీకర్‌ను కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి  ఫిర్యాదుకు అదనపు సమాచారం జోడించి ఇచ్చారు. దీంతో స్పీకర్ కార్యాలయం స్పందించింది. 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు నోటీసులు జారీ చేసింది. మరి ఇప్పుడు దీనికి రఘురామ కృష్ణంరాజు ఏం సమాధానం చెబుతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

rrr