విశాఖ భూముల కుంభ‌కోణంపై  సీఎం జ‌గ‌న్‌కు వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు లేఖ రాశారు.భూముల కుంభ‌కోణంలో సిట్ ఇచ్చిన నివేదిక‌లో ఉన్న వ్య‌క్తుల‌పై త‌ర్వ‌గా విచార‌ణ చేయించాల‌ని లేఖ‌లో కోరారు. ఈ భూకుంభ‌కోణంలో పాలుపంచుకున్న రాజ‌కీయ‌నాయ‌కుల‌పైనా,అధికారుల‌పైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని లేఖ‌లో పేర్కోన్నారు. ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల‌కు పార్టీ ఇంఛార్జ్‌గా ఉన్న వ్య‌క్తి సిట్ నివేదిక‌లో పేర్కోన్న వారిని పిలిచి వివాద‌స్ప‌ద భూమిలో పెద్ద వాటా త‌న‌కు ఇచ్చేయాల‌ని డిమాండ్ చేస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయ‌ని..దీనిపై కూడా విచార‌ణ చేయాల‌ని రఘురామ‌కృష్ణం రాజు పేర్కొన్నారు.ఎంపీ విజ‌యసాయిరెడ్డికి చెందిన ప్ర‌గ‌తి భార‌తి ట్ర‌స్ట్ ఎంత మేర‌కు నిధులు సేక‌రించింది. ఆ నిధులను దానం చేసిన వారు ఎవ‌రు,ఆ ట్ర‌స్ట్ పెట్టిన ఖ‌ర్చులు ఏమిటి లాంటి అతి ముఖ్య‌మైన వివ‌రాల‌ను ప్ర‌జ‌ల‌కు తెల‌పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న తెలిపారు.విజయ‌సాయిరెడ్డి ఒక ప్ర‌జాప్ర‌తినిధి కాబ‌ట్టి ఇలాంటి విష‌యాల్లో గోప్య‌త పాటించ‌కుండా  ప్ర‌జ‌ల‌కు నిజాలు తెల‌పాల‌ని లేఖ‌లో పేర్కోన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr