ఎంపీ రఘు రామ కృష్ణం రాజు ఒక జోస్యం పలికారు.. ఈ సోమవారం సీబీఐ కోర్టులో ఎవరేంటో తేలిపోతుందని అన్నారు. ఆ రోజు కొందరి కథ క్లైమాక్స్ కు వస్తుందని ఎంతో ధీమాతోచెప్పారు. ఆ ఇద్దరు వ్యక్తులపై మరికొన్ని కీలక కామెంట్స్ చేశారు. తాను ఎలాంటి వాడినో తెలిసి మరీ టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఓ ప్రముఖ వ్యక్తి ని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలు కారణంగా ఇప్పటికే ఆయన అనేక ఇబ్బందుల్లో ఉన్నారన్న సంగతి విధితమే.. కానీ ఆయన ఎక్కడా తగ్గడం లేదు. ప్రత్యర్థి పార్టీల అండగా ఉంటూ ఈ మాటలు అన్నీ అనిపిస్తున్నాయని వైసీపీ ఆధారాలతో సహా చెబుతున్న మాట. కానీ ఆర్ ఆర్ ఆర్ తన పంథాను వీడడం లేదు. మరోవైపు ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతున్నారు వైసీపీ ఎంపీలు.. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అన్నది తేలక తలలుపట్టుకోవాల్సి వస్తుందని పరిశీలకుల భావన. వాస్తవానికి రఘురామ ఎంపీగా గెలిచిన నాటి నుంచి ఇదే దూకుడులో ఉన్నారు. ముందు తనకు జగన్ ఎవరో తెలియదని అన్నారు కూడా.. అది పొరపాటున వచ్చిన మాట కూడా కాదు కానీ అనేశారు..తనకు ఆయన ఫొటో పెట్టుకుని గెలవాల్సిన అవసరం కూడా లేదని చెప్ప ఇంకో వివాదం రేపారు.. వివాదమే విధానంగా ఉన్న ఆయన ఈ సారి ఆ ఇద్దరు వ్యక్తులూ తనపై ప్రధానికి లేఖ రాయడం జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ఇలా మాట్లాడుతున్నారని ఆర్ ఆర్ ఆర్ సన్నిహితుల మాట.
ఎంపీ రఘు రామ కృష్ణం రాజు ఒక జోస్యం పలికారు.. ఈ సోమవారం సీబీఐ కోర్టులో ఎవరేంటో తేలిపోతుందని అన్నారు. ఆ రోజు కొందరి కథ క్లైమాక్స్ కు వస్తుందని ఎంతో ధీమాతోచెప్పారు. ఆ ఇద్దరు వ్యక్తులపై మరికొన్ని కీలక కామెంట్స్ చేశారు. తాను ఎలాంటి వాడినో తెలిసి మరీ టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఓ ప్రముఖ వ్యక్తి ని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలు కారణంగా ఇప్పటికే ఆయన అనేక ఇబ్బందుల్లో ఉన్నారన్న సంగతి విధితమే.. కానీ ఆయన ఎక్కడా తగ్గడం లేదు. ప్రత్యర్థి పార్టీల అండగా ఉంటూ ఈ మాటలు అన్నీ అనిపిస్తున్నాయని వైసీపీ ఆధారాలతో సహా చెబుతున్న మాట. కానీ ఆర్ ఆర్ ఆర్ తన పంథాను వీడడం లేదు. మరోవైపు ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతున్నారు వైసీపీ ఎంపీలు.. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అన్నది తేలక తలలుపట్టుకోవాల్సి వస్తుందని పరిశీలకుల భావన. వాస్తవానికి రఘురామ ఎంపీగా గెలిచిన నాటి నుంచి ఇదే దూకుడులో ఉన్నారు. ముందు తనకు జగన్ ఎవరో తెలియదని అన్నారు కూడా.. అది పొరపాటున వచ్చిన మాట కూడా కాదు కానీ అనేశారు..తనకు ఆయన ఫొటో పెట్టుకుని గెలవాల్సిన అవసరం కూడా లేదని చెప్ప ఇంకో వివాదం రేపారు.. వివాదమే విధానంగా ఉన్న ఆయన ఈ సారి ఆ ఇద్దరు వ్యక్తులూ తనపై ప్రధానికి లేఖ రాయడం జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ఇలా మాట్లాడుతున్నారని ఆర్ ఆర్ ఆర్ సన్నిహితుల మాట.