శ్రీలంక తో టీ20 సిరీస్ ఆడుతున్న ఇండియా కి 11 మంది ఆటగాళ్లు లేని దారుణ పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికె కరోనా మరియు గాయాల కారణంగా చాలామంది ఆటగాళ్లు ఈ సిరీస్ లో నుంచి తప్పుకోగా, నిన్న జరిగిన టి 20 లో స్టార్ ఫెసర్ అయినా నవదీప్ సైనీ గాయపడ్డాడు. ప్రస్తుతం నవదీప్ సైని వైద్యుల పర్యవేక్షణలో గా ఉన్నాడు. కాగా నిన్న జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న నవదీప్ గాల్లోకి ఎగిరిన బంతిని పట్ట్టుకునే క్రమం లో గాయపడ్డాడు. ఇప్పటికే సరైన టీమ్ లేకుండా సతమతమవుతున్న ధావన్ సేన నవదీప్ గాయం కారణంగా తప్పుకోవడంతో మరింత ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఇక ఇప్పటికే  కృనాల్ పాండ్యా కరోనాతో సిరీస్ నుంచి తప్పుకోవడంతో అతడితో పాటు మరి కొంత మంది క్రీడాకారులు ఐసోలేషన్ లో ఉన్నారు. ఇక నవదీప్ సైని స్థానంలో తమిళనాడుకు చెందిన స్థాయి కిషోర్ కి అవకాశం లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: